తెలంగాణా సచివాలయంలో ఉన్న దేవాలయాలను కూల్చడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి విపక్షాలు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కాస్త ఘాటుగా సిఎం కేసీఆర్ పై విమర్శలు చేసారు. సచివాలయంలో ఉన్న మసీదు, నల్లపోచమ్మ దేవాలయాన్ని కూలగొట్టిన కారణంగా రాష్ట్ర సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్‌ కుమార్‌కు బేడీలు వెయ్యాలని...  చర్లపల్లి జైల్లో పెట్టాలని రేవంత్ డిమాండ్ చేసారు. 

 

కేసీఆర్ వేసే మెతుకుల కోసం బీజేపీ నేతలు కక్కుర్తిపడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అక్కడ దేవాలయం కూల్చివేతపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి తో పాటుగా మరో ఎంపీ బండి సంజయ్ స్పందించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమానికి వేదికైన నల్లపోచమ్మ దేవాలయం, మసీదులను అమానుషంగా కూల్చటాన్ని ఖండిస్తున్నామని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: