కరోనా కట్టడిలో చాలా వరకు సమర్ధవంతంగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సహా ఈశాన్య రాష్ట్రాలు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో కేవలం రెండు కేసులు మాత్రమే గత 24 గంటల్లో నమోదు అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్ లో ఈ రోజు రెండు కొత్త పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,143 చేరుకుంది అని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 268 క్రియాశీల కేసులు ఉన్నాయి అని అక్కడి ప్రభుత్వం తాజాగా పేర్కొంది. 851 మంది కరోనా నుంచి కోలుకున్నారు అని 9 మంది కరోనాతో మరణించారు అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.