స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ను కరోనా కేసులు భారీగా వెంటాడుతూ ఉన్నాయి.  రోజు రోజుకి సిబ్బంది లో కరోనా కేసులు పెరగడం తో ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలుగుతుంది. తెలంగాణా మొత్తం స్టేట్ బ్యాంకు లో 80 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. ఇక హైదరాబాద్ లోనే కరోనా దెబ్బకు 10 బ్రాంచ్ లను స్టేట్ బ్యాంకు మూసి వేసింది. 

 

ఇక ఉన్నతాధి కారులు సహా చిన్న చిన్న ఉద్యోగులు కూడా ఇప్పుడు తాము విధులకు హాజరు కాలేము అని తమ వల్ల కాదు అని చెప్తున్నారు. కరోనా కేసులు పెరగడంపై వారిలో భయం మొదలైంది. అందుకే ఇప్పుడు విధులకు హాజరయ్యే విషయంలో వారు కాస్త భయపడుతున్నారు. అయితే విధులకు రావాలి అని స్టేట్ బ్యాంకు ఒత్తిడి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: