కరోనా రావడం ఏమో గాని జనాలు మాత్రం దానికి బాగానే భయపడుతున్నారు. కొంత మంది వైద్యం తీసుకోవడానికి భయపడితే మరికొందరు అది వస్తే ప్రాణం పోతుంది అని భయపడుతూ ఇంట్లో వారికి ఎక్కడ సోకే అవకాశం ఉందో అనే ఆందోళనతో ఇళ్ళ నుంచి వెళ్ళిపోతున్నారు. తాజాగా విజయవాడ నగరం లో ఒక ఘటన వెలుగు లోకి వచ్చింది. అసలు కథ ఏంటీ అంటే... 

 

విజయవాడ పటమటలో నివాసం ఉండే శ్రీనివాస రావుకు కరోనా లక్షణాలు ఉండటంతో పరిక్షలు చేయించుకుని ఇక అక్కడి నుంచి కనపడకుండా పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటీ అనేది ఎవరికి చెప్పలేదు. కరోనా వచ్చింది అనే భయంతో అతను పారిపోయాడు. అతను వెళ్ళిపోయి ఏడు రోజులు అయినా సరే ఇంకా ఇంటికి రాలేదు. అతనికి నెగటివ్ అని వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: