రాష్ట్రంలో కరోనా విజృంభన కొనసాగుతోంది. శుక్రవారం 10,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1278మందికి పాజిటివ్​ వచ్చింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 32,224కు చేరింది. కొవిడ్​తో మరో ఎనిమిది మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 339కి పెరిగింది.  రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1013 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటి వరకు వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,205కు చేరింది. మొత్తం బాధితుల సంఖ్య 12,680కు చేరింది. 

 


ఇందులో దాదాపు 10 వేల మంది హోమ్ ఐసోలాషన్​లో ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో డిశ్చార్జ్ అవుతున్న వారు 60 శాతం ఉండగా, 1 శాతం మరణాలు, 39 శాతం మాత్రమే ప్రస్తుతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.ఇక యాక్టివ్ కేసుల్లో కూడా 83% మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని, 13% మందిలో కొద్దిపాటి లక్షణాలు ఉండగా కేవలం 4% మందిలో మాత్రమే తీవ్ర లక్షణాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శుక్రవారం జీహెచ్​ఎంసీ పరిధిలో 762 కరోనా కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి పరిధిలో 171 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో​ 85, సంగారెడ్డి 36, నల్గొండ 32, మెదక్​ 22, కామారెడ్డి 23, ఖమ్మం జిల్లాలో​ 18 కేసులొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: