పశ్చిమ బంగాకు చెందిన ఓ టీవీ నటి.. తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. పరిచయస్తుడైన యువకుడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు జులై 8న నమోదైన ఫిర్యాదులో పేర్కొంది. 'సాత్​ బాయ్​ చంపా' అనే​ ధారావాహికలో ఈమె ఓ కీలకపాత్రలో నటిస్తోంది.

 

బాధిత నటికి తెలిసిన ఓ యువకుడు.. జులై 5న అప్పు కోసం ఆమె ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే ఒంటరిగా ఉన్న ఆ మహిళపై అత్యాచారం చేసి, తన ఫోన్ లో  వీడియో తీసినట్లు వెల్లడించింది. పోలీసులకు చెప్తే​ సదరు వీడియోను ఇంటర్నెట్​లో పెడతానని ఆమెను బెదిరించినట్లు పేర్కొంది. దీంతో బాధితురాలు జాదవ్​పూర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

 

బాధితురాలు పశ్చిమ బంగాలోని నడియా జిల్లాకు చెందిన ఈ యువతి.. వృత్తిలో భాగంగా మోడలింగ్​ నేర్చుకుంటూ కోల్​కతాలో ఒంటరిగా ఉంటుంది. తనపై అత్యాచారం చేసిన అతడితో ఆమెకు ఇదివరకే పరిచయం ఉంది. నిందితుడు లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచే​ తనను కలవాలమని ఒత్తిడి చేసేవాడని.. దానికి తను అంగీకరించలేదని ఆమె తెలిపింది. తన వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల అప్పు అడిగేందుకు వచ్చిన అతడు, ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: