ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన 'బుట్టబొమ్మ' పాట(అల వైకుంఠపురములో సినిమా) మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఎక్కువసార్లు చూసిన తొలి తెలుగు గీతంగా నిలిచింది. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. దీని తర్వాతి స్థానంలో 'వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే'(ఫిదా) సాంగ్ ఉంది.

 

అయితే బుట్టబొమ్మ ఆడియో విడుదల చేసినప్పటి నుంచి శ్రోతల మనసు గెల్చుకుంటూనే ఉందీ గీతం. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. ఈ పాటకు టిక్​టాక్​ చేసిన వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, సీనియర్ నటి సిమ్రాన్​తో పాటు పలువురు తారలు ఉండటం విశేషం.ఈ గీతంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు తెగ ఆకట్టుకున్నాయి. అందుకే పాటను మళ్లీ మళ్లీ చూసేలా చేశాయి. అయితే ఈ సాంగ్ విషయంలో జరిగిన ఆసక్తికర సంఘటనను గతంలో ఓసారి చెప్పారు సంగీత దర్శకుడు తమన్.

 

తొలుత ఈ పాట స్థానంలో వేరొకటి అనుకున్నాం. కానీ అది బన్నీకి నచ్చలేదు. దీంతో కేవలం మూడురోజుల్లోనే 'బుట్టబొమ్మ'ను కంపోజ్ చేశాను. ఆ తర్వాత యూట్యూబ్​లో రచ్చ అంతా మీకు తెలిసిందే" అని తమన్ చెప్పుకొచ్చారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: