అరుణాచల్ ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు మరణించటంపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు.పాపుమ్ పరే జిల్లాలోని టిగ్డోలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8 నెలల శిశువుతో సహా.. నలుగురు దుర్మరణం చెందారు. పాసిఘాట్లోని సిబో కోరింగ్ నదిలో చిక్కుకున్న ఓ జంటను రక్షించారు సహాయక సిబ్బంది.