హైదరాబాద్ లో ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఎక్కడో ఒక చోట ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతూనే ఉన్నారు. ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే జనాలు అప్రమత్తంగా లేకపోవడంతో ఇప్పుడు చాలా వరకు కూడా సైబర్ మోసాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ లో మరో భారీ మోసం జరిగింది. 

 

అది ఏంటీ అంటే... హైదరాబాద్ బేగంపేట లో నివాసం ఉండే మహమ్మద్ యాసిన్ అహ్మద్ ఆన్లైన్‌లో కన్స్ట్రక్షన్ గ్లౌస్‌లను ఇటీవల ఆర్డర్ చేసాడు. ఆర్డర్ చేసిన వెంటనే అతనికి తెలియకుండానే అతని ఖాతా నుంచి రూ.6.88 లక్షలు కాజేశారు. వెంటనే అతను సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: