దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే గత 24 గంటల్లో మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అని కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో అత్యధికంగా 27,114 కొత్త కేసులు భారత్ లో నమోదు అయ్యాయి. 

 

మొత్తం కేసులు దేశంలో 8,20,916 వద్ద ఉన్నాయని కేంద్రం పేర్కొంది. వీటిలో 2,83,407 క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్రం వివరించింది. 5,15,386 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. కరోనా బారిన పడి దేశ వ్యాప్తంగా 22,123 మరణించారు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: