అక్రమ మద్యం విషయంలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం ఆగడం లేదు. అక్రమ మద్యం విషయంలో ఎంత కఠినం గా వ్యవహరిస్తున్నా సరే రెండు జిల్లాల్లో మాత్రం ఎక్కడో ఒక చోట అక్రమ మద్యం బయటపడుతూనే ఉంది. మైలవరం మండలం మొర్సుమల్లి చెక్ పోస్ట్ వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 

 

అక్రమ మద్యం  తరలిస్తున్నారు అనే సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. 1080 అక్రమ మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా పోలీసులు స్వాధీనం  చేసుకుని 9 మందిని అరెస్ట్ చేసారు. వారి వద్ద నుంచి ఒక ఆటో తో పాటుగా కారు రెండు మోటార్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: