రంగారెడ్డి జిల్లా షాబాద్ ఇన్స్పెక్టర్ శంకరయ్య విషయంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అతని వ్యవహారంలో ఇప్పుడు సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ అధికారులు సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఏసీబీ దాడుల్లో దొరికిన శంకరయ్యకు పాత నేరస్తులతో సంబంధాలు ఉన్నాయి అని అధికారులు తేల్చారు. 

 

అతను సంచలన హత్యల్లో ఉన్న నేరస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నట్టు గుర్తించారు. సంచలనం రేపిన విజయవాడ వ్యాపారి చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడికి పలు రకాలుగా సాయం ఇన్స్పెక్టర్ శంకరయ్య చేసాడు అని అధికారులు గుర్తించారు. చిగురుపాటి హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డికి సహకరించాడు అని అధికారుల విచారణలో వెల్లడి అయింది. ఇక అతని ఆస్తుల మీద కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: