సమాజం మారుతున్నా సరే కొందరిలో మాత్రం ఏ మార్పులు రావడం లేదు. ప్రేమించారు అని దాడులు చేస్తున్న ఘటనలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక ఘటన తెలంగాణా లో వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా బాసర లో ఒక అమ్మాయి ప్రేమించింది అని తల్లి తండ్రులు విచక్షణా రహితంగా దాడి చేసారు. 

 

బాసర మండలం కౌఠ గ్రామంలో ప్రేమ వివాహం చేసుకుని ఇంటికి వచ్చింది ఒక అమ్మాయి. ఇక కోపం పట్టలేని తల్లి తండ్రులు ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టారు. నెల రోజుల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇక అప్పుడే ఆమె వివాహం చేసుకుంది అని తల్లి తండ్రులకు సమాచారం అందింది. ఇంటికి రాగానే ఆమెపై దాడికి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: