ఏపిలో ఈ మద్య రాజకీయాల్లో రగడ కొనసాగుతుంది. అధికార పక్షంపై ప్రతిపక్షాల విసుర్లు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ మద్య కొంతమంది రాజకీయ నేపథ్యంలో పాత కక్షలు విషయంలో దాడులు చేసుకొవం.. చంపుకోవడం కూడా జరుగుతుంది. తాజాగా బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు కేజీబీవీ వద్ద భాజాపానేత హీరోజీరావుపై ఇనుప రాడ్డుతో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.
ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అప్రమత్తమై హీరోజీరావు వేగంగా వెళ్లడంతో.. అక్కడినుంచి దుండగులు పరారయ్యారు. ఇది రాజకీయ కక్ష్య సాధింపు అనుకోవడం లేదని.. గతంలో నేమకల్లు తెల్ల కంకర క్రషర్ యజమానులపై ఎన్జీటీలో ఫిర్యాదు చేశాడన్న అక్కసుతోనే హీరోజీరావుపై దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు.