భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు మందు కోసం నానా కష్టాలు పడుతున్నారు జనాలు. ఈ మందు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు వచ్చే అవకాశం లేదు. ఇక అప్పటి వరకు మాస్క్ లు సామాజిక దూరమే గతి. ఈ తరుణంలో డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఒక గుడ్ న్యూస్ జనాలకు అందించింది. అది ఏంటీ అంటే... 

 

చర్మ వ్యాధి సోరియాసిస్ కి అందించే ఒక పవర్ ఫుల్ మందుని రంగంలోకి దింపారు. దాని పేరు ఏంటీ అంటే ఇటోలిజమాబ్. కాస్త నోరు తిరగడం కష్టమే గాని ఇప్పుడు ఇది కరోనా రోగులకు ప్రాణం పోయే పరిస్థితి లో ఉంటే మాత్రమే ఇస్తారు. దాన్ని బెంగళూరు లో పరిక్షలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే అత్యవసరంగా వాడటానికి అనుమతి ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: