ఈ నెల మూడో వారంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి రాష్ట్రాల సిఎం లతో సమావేశం నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా వ్యాఫి క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఆయన సిఎం లతో కరోనా కట్టడికి సంబంధించి చర్చించే అవకాశం ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల సిఎం లతో ఆయన రెండు పర్యాయాలు గా సమావేశమయ్యే అవకాశం ఉంది. 

 

ఇప్పటికే రాష్ట్రాల సిఎం లకు దీనికి సంబంధించి సమాచారం కూడా వెళ్ళింది అనే వార్తలు వస్తున్నాయి. ప్రధానితో పాటుగా ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొనే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ ని కొన్ని రాష్ట్రాలు స్వచ్చందంగా విధిస్తున్న నేపధ్యంలో దానిపై మోడీ చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: