ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా పని చేసినా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. కరోనా నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 

 

నెల్లూరు దిశ పోలీసు స్టేషన్లో మహిళా పీసీకి కరోనా వచ్చింది. దీనితో అదే పీఎస్‌లో పనిచేసే అధికారులతో పాటుగా, సిబ్బందికి కరోనా పరీక్షలు  నిర్వహిస్తున్నారు అధికారులు. బాలాయపల్లి పోలీస్టేషన్లో రెండు కేసులు... తహశీల్దార్ కార్యాలయంలో 5 కేసులు...  ప్రభుత్వ ఆసుపత్రిలో 2  కేసులు నమోదు అయ్యాయి అని అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెం గ్రామంలో ఆర్టీసీ డ్రైవర్ కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: