శేషాచలం అడవుల్లో మళ్ళీ టాస్క్ ఫోర్స్ అధికారులకు తమిళ స్మగ్లర్లు చుక్కలు చూపిస్తున్నారు. శేషాచలంలో టాస్క్‌పోర్స్ పోలీసులు శనివారం కూంబింగ్ నిర్వహించగా వారికి చంద్రగిరి మండలం భీమవరం ఘాట్ రోడ్డులో  ఉన్న అటవీ ప్రాంతంలో తమిళ స్మగ్లర్లు కనిపించారు. 

 

ఈ క్రమంలో రెచ్చిపోయిన తమిళ స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులపై రాళ్ళ దాడి చేసారు. పోలీసులు కూడా అదే స్థాయిలో స్పందించడంతో అక్కడి నుంచి వారు పారిపోయారు. వారి వద్ద నుంచి 33 ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 35 మంది అడవిలోకి వచ్చారు అని అధికారులు గుర్తించారు. వారి నుంచి ఆహర పదార్ధాలతో పాటుగా  టార్చిలైట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: