మన దేశంలో కరోనా కేసుల అంకంలో మరో రికార్డు నమోదైంది. ఇప్పటికే గత పది రోజులుగా సగటున రోజుకు 20 వేల కేసులతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోన్న కరోనా వైరస్ ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠస్థాయిలో గత ఒక్కరోజులో 27,114 కేసులతో తిరుగులేని రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 519 మరణాలు కూడా నమోదు అయ్యాయని.. ఇది కూడా సరికొత్త రికార్డు అని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 8,20,916కి చేరింది.
ఇక గత మూడు రోజుల్లోనే ఏకంగా లక్ష కొత్త కేసులు నమోదు కావడాన్ని బట్టి చూస్తే దేశంలో కరోనా ఎంత విధ్వసంతో ముందుకు దూసుకు వెళుతుందో ? అర్థమవుతోంది. ఇక దేశంలో ఈ లెక్కన కేసులు నమోదు అయితే ఒక్క నెల రోజుల్లోనే ఏకంగా 10 లక్షల కేసులు నమోదు అవుతాయి. వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 2,83,407 మంది చికిత్స పొందుతుండగా.. 5,15,386 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు కేంద్రం తెలిపింది. కరోనాతో ఇప్పటి వరకు 22,123 మంది ప్రాణాలు కోల్పోయారు.