ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. చాపకింద నీరులా పాకీపోతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మందిని బలి తీసుకుంటుంది, సామాన్య ప్రజలు సెలబ్రిటీలు నాయకులు అధికారులు అనే తేడా లేకుండా అందరినీ కదిలిస్తుంది ఈ మహమ్మారి వైరస్. అయితే ఇటీవలే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కార్యాలయంలో సిబ్బందికి కరోనా వైరస్ సోకటం సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే.
అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నివాసాన్ని కరోనా వైరస్ వదలటం లేదు. ముఖ్యమంత్రి నివాసం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలో రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారు ఎక్కువవుతున్నారు. ఇప్పటివరకు ఏకంగా ముఖ్యమంత్రి నివాసం, కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది 80 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోగ్యం మాత్రం బాగానే ఉందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా నితీష్ కుమార్ మేనకోడలు కరోనా వైరస్ బారినపడి ప్రస్తుతం ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసిందే.