ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం పై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది టీడీపీ. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని పదే పదే వైసీపీ సర్కార్ ని టార్గెట్ గా చేసుకుని టీడీపీ నేతలు స్మృతి వనం కట్టడాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయింది.
టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. మాట్లాడితే దళిత నాయకుడిని అంటావ్ అంటూ అంబేద్కర్ స్మృతివనం జగన్ గారి ప్రభుత్వం కట్టాలని ప్రతిపాదిస్తే ఎలా కడతారని ప్రశ్నిస్తావ్. దళితులకు అన్యాయం చేసింది ఎవరు వర్ల ? పోనీ నీకు అన్యాయం చేసింది ఎవరు ? అని ప్రశ్నించారు.
మాట్లాడితే దళిత నాయకుడిని అంటావ్.
— Vijayasai reddy v (@VSReddy_MP) July 11, 2020
అంబేద్కర్ స్మృతివనం జగన్ గారి ప్రభుత్వం కట్టాలని ప్రతిపాదిస్తే ఎలా కడతారని ప్రశ్నిస్తావ్.
దళితులకు అన్యాయం చేసింది ఎవరు వర్ల ?
పోనీ నీకు అన్యాయం చేసింది ఎవరు ?