వాస్తవాలు చెబుతుంటే ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టులు చేస్తోందట. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడేదీ తెలియట్లేదు ఉమకి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణాలు బయటకు వస్తే నువ్వూ ఊచలు లెక్కపెట్టాల్సిందే. మాజీ సిఎం, మాజీ మంత్రులైనా ఎవరూ తప్పించుకోలేరు. దోచుకోవడాలు పంచుకోవటాలు మీతోనే పోయాయి అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఘాటుగా స్పందించారు. 

 

ఇరిగేషన్ ను దేశంలో 2వ స్థానంలో నిలబెట్టాం. కారు దింపిన తర్వాత ఫ్రస్టేషన్ లో పడ్డావ్.108 అంబులెన్సుల్లో 307 కోట్లు కొట్టేశావు. 12 సిబిఐ,ఈడి కేసుల్లో 16 నెలలు ఊసలు లెక్కపెట్టావు. మీతప్పుడు కేసులకి భయపడం. జైలు నుండి బెయిల్ పై వచ్చావ్ ఒళ్ళు సోయిలో పెట్టుకో, బెదిరింపులు ఆపు జరబద్రం అంటూ దేవినేని ఉమా అదే స్థాయిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: