తెలంగాణా సిఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర స్థాయిలో విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపధ్యంలో కాసేపటి క్రితం కేసీఆర్ ప్రగతి భవన్ కి వెళ్ళారు.  ప్రగతి భవన్ లో కరోనా కేసులు రావడంతో ఆయన రెండు వారాలుగా తన ఎర్రవల్లి ఫామ్‌ హౌస్‌లోనే  ఉండి కేసీఆర్ విధులు నిర్వహిస్తున్నారు. 

 

ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియడం లేదని కొందరు ఏకంగా హైకోర్ట్ కి వెళ్ళగా సోషల్ మీడియాలో కేసీఆర్ ఎక్కడ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ని కూడా రన్ చేసారు. ఈ తరుణంలో కేసీఆర్ సైలెంట్ గా ప్రగతి భవన్ కి వచ్చారు. సిఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి ఏ ఇబ్బంది లేదు అని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. అనవసర రాద్దాంతం చేయవద్దు అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: