భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎక్కడో ఒక చోట ఏదోక రూపంలో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదులను భారత బలగాలు గుర్తించడం లేదా వాళ్ళే బలగాల మీద కాల్పులు జరపడం వంటి చర్యలు జరుగుతున్నాయి. ఇక పాకిస్తాన్ నుంచి ఏ స్థాయిలో కట్టడి చేసినా సరే ఉగ్రవాదులు భరత్ లోకి అడుగు పెడుతూనే ఉన్నారు. 

 

నియంత్రణ రేఖ వద్ద నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చిపారేసింది. జమ్ము-కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాకు కేవలం 100మీ దూరంలో భారత్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న ఇద్దరినీ భారత బలగాలు కాల్చి చంపాయి. వారి వద్ద నుంచి ఆయుధాలను కూడా భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది అని ఆర్మీ అధికారులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: