భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో ఇప్పుడు మరోసారి సర్జికల్ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సరిహద్దుల్లో భారీగా ఉగ్రవాదులు భారత్ లోకి అడుగు పెట్టే అవకాశాలు ఉన్న నేపధ్యంలో ఇప్పుడు భారత ఆర్మీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. గాల్వాన్లో చైనా దొంగ దెబ్బ చూశాక పాకిస్తాన్ విషయంలో కేంద్రం మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ఇక సరిహద్దుల్లో ఇప్పుడు ఉగ్రవాదులను కట్టడి చేయడానికి గానూ మరోసారి లాంచ్ ప్యాడ్ ల టార్గెట్ గా సర్జికల్ దాడులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు.
భారీగా లాంచ్ ప్యాడ్ లలో ఉగ్రవాదులు ఉన్నారు అని ఆర్మీ అంటోంది. ఇప్పుడు వారిని టార్గెట్ గా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని ఈ మేరకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు అని తెలుస్తుంది. నేడు ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను లేపెసారు. దీంతో పాక్ సరిహద్దుల్లో సైతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.