మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని కాల్చి చంపిన తర్వాత అతని పునాదుల మీద దృష్టి పెట్టింది ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖ. బాబు ఆస్తుల మీద ఫోకస్ పెట్టింది. అదే విధంగా అతని అనుచరులు అతనితో పాటు ఉన్న కొంత మంది రౌడీ షీటర్ లను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. 

 

అతని గ్యాంగ్ లో ఎవరు అయితే కీలకంగా ఉన్నారో వారి మీద ఫోకస్ చేస్తుంది. నేడు ఒక ఇద్దరినీ అరెస్ట్ చేయగా వారిలో ఒకరు అతనికి బాగా సన్నిహిత వ్యక్తి. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శనివారం నాడు థానేలో అతని గ్యాంగ్ కి చెందిన ఇద్దరినీ అరెస్ట్ చేయడం గమనార్హం. అరవింద్ అలియాస్ గుడాన్ త్రివేదితో పాటుగా అతని డ్రైవర్ సుశీల్ కుమార్ అలియాస్ సోను తివారీని అరెస్ట్ చేసారు. వీరిని యూపి పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: