శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాం ముందే వైసీపీ నేతలు ఒకరిని ఒకరు తన్నుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమదాలవలస మండలం దన్నానపేటలో స్పీకర్ ముందే తన్నుకున్నారు వైసీపీకి చెందిన కార్యకర్తలు. రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన సందర్భంగా గొడవ చెలరేగింది. 

 

స్కూల్ బిల్డింగ్ శంకుస్థాపనకు వెళ్లిన స్పీకర్‌కు ఓ వర్గం స్వాగత ఏర్పాటు చేయగా ఆగ్రహించిన మరో వర్గం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీనితో స్పీకర్ వచ్చే సమయానికి ఒకరిని ఒకరు తన్నుకున్నారు. ఇక స్పీకర్ ఈ విషయం తెలుసుకుని రెండు వర్గాలను వారించే ప్రయత్నం చేసారు. ఇక ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: