కేరళలో గత 24 గంటల్లో 488 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర సిఎం పినరాయి విజయన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం హాట్‌స్పాట్‌ల సంఖ్యను 195 గా ఉందని ఆయన అన్నారు. మరో 16 ప్రాంతాలను కరోనా హాట్‌స్పాట్‌గా ఎంపిక చేసామని ఆయన పేర్కొన్నారు. 

 

ఇక రాష్ట్రంలో జరుగుతున్న నిరసనలపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తూ కేరళలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. నేడు కూడా కొన్ని చోట్ల నిరసనలు జరిగాయని ఆయన అన్నారు. దీన్ని అనుమతించలేమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నిరసనలు చేసేవారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: