మహారాష్ట్ర రాజధాని ముంబై లో కరోనా కేసులు కాస్త వేగంగానే పెరుగుతున్నాయి. గతం వారంలో కాస్త తగ్గినా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ముంబై ధారావీ లో కరోనా కేసులు దాదాపుగా కట్టడి అయ్యాయి. ప్రభుత్వం కాస్త సమర్ధవంతంగా వ్యవహరించడంతో కేసులు అదుపులోకి వచ్చాయి. 

 

ముంబైలోని ధారావి ప్రాంతంలో ఈ రోజు 11 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రాంతంలో మొత్తం కేసుల సంఖ్య 2370 గా ఉన్నాయని... ఇందులో 122 క్రియాశీల కేసులు ఉన్నాయని... 2002  మంది కరోనా నుంచి కోలుకున్నారు అని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) తాజాగా హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: