తిరుపతిలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు కట్టడి అయినట్టే అయి భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా అక్కడ 172 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ తిరుపతిలో 172 కేసులు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

 

తిరుపతి అర్బన్ 144 కేసులు నమోదు కాగా రూరల్ 28 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 300 కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య చిత్తూరు జిల్లాలో 2509కు చేరుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకూ 1126 మంది అక్కడ కరోనా నుంచి కోలుకున్నారు. ఇక 1364 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19 మంది జిల్లాలో మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: