కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. మహారాష్ట్రలో ఇవాళ 8వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువైంది. తమిళనాడులో ఇవాళ దాదాపు 4 వేల మంది వైరస్ బారిన పడ్డారు.
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. అయితే.. రికవరీ రేటు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 5 లక్షల మార్కును దాటినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 62.78 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది.
తమిళనాడులో ఇవాళ 3,965 కొత్త కేసులు భయటపడ్డాయి. మరో 69 మంది మరణించారు. నేడు 3,591 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,34,226కు.. మరణాలు 1,898కి చేరాయి. 46వేల 410 యాక్టివ్ కేసులు ఉన్నాయి.