భారతదేశంలో 2018లో చేపట్టిన పులుల గణన... ప్రపంచంలోనే అతిపెద్ద కెమెరా ట్రాపింగ్ వన్యప్రాణుల సర్వేగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది.గతేడాది ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2018 నాలుగో విడత గణాంకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని ప్రకారం, భారత్లో 2,967 పులులు ఉన్నాయి.
అంటే ప్రపంచంలోని మొత్తం పులుల్లో 75 శాతం భారత్లోనే ఉన్నాయి.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో... పులుల సంఖ్యను రెట్టింపు చేయాలనే 'సంకల్ప్ సే సిద్ధి' లక్ష్యాన్ని నాలుగేళ్ల ముందే చేరుకున్నట్లు జావడేకర్ పేర్కొన్నారు.ఈ కెమెరా ట్రాప్ వల్ల మొత్తంగా.. 3,48,58,623 వన్యజీవుల చిత్రాలను సేకరించగలిగారు. ఈ ఫొటోల్లో 76,651 పులులు, 51,777 చిరుతపులులు, మిగిలినవి ఇతర జీవులు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మొత్తంగా 2,461 పులులను (కూనలు మినహాయిస్తే) గుర్తించారు.