తూర్పు లద్దాఖ్​ సరిహద్దుల్లో చైనా తన ప్రాబల్యాన్ని క్రమంగా తగ్గిస్తోంది. తాజాగా ఫింగర్​- 4 ప్రాంతం నుంచి తన బలగాలను వెనక్కు పంపినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్యాంగాంగ్​ సరస్సులోనూ కొన్ని పడవలను తొలగించినట్లు స్పష్టం చేశాయి. భారత్​తో మరో దఫా లెఫ్టినెంట్ జనరల్​ స్థాయి చర్చలు జరగనున్న నేపథ్యంలో చైనా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

 

గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటనల తర్వాత రెండు దేశాలు బలగాల ఉపసంహరణకు నిర్ణయించాయి. భారత్​, చైనా మధ్య జరిగిన దౌత్య, సైనిక చర్చల్లో భాగంగా ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. సరిహద్దుల్లో శాంతి పునరుద్ధరణలో భాగంగా సోమవారం నుంచి రెండు దేశాలు కీలక ప్రాంతాల్లో ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: