ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. కేంద్రం సహకారం ఉన్నా లేకపోయినా సరే కరోనా తీవ్రత ఉన్నా సరే పోలవరం ప్రాజెక్ట్ పనులు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. దీనిపై తాజాగా విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసారు. పోలవరం పూర్తి చేసేది సిఎం జగనే అంటూ ఆయన స్పష్టం చేసారు. 

 

పోలవరం పూర్తి చేసేది ఆ మహానేత తనయుడే. ఆగస్ట్ 15 నాటికి 17,760 కుటుంబాలకు పునరావాస ఏర్పాట్లు పూర్తి అవుతాయని అన్నారు. ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల పంట భూమి, 6.36 లక్షల పరిహారం. పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: