ఉగ్రవాదులకు ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చిన ఆర్మీ... ఇప్పుడు మళ్ళీ వరుసగా కాల్పులకు దిగుతుంది.  జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు చుక్కలు చూపించడానికి భారత ఆర్మీ రెడీ అయింది. ఎక్కడా కూడా ఉగ్రవాదులను భారత బలగాలు ఉపేక్షించడం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ మరోసారి ఎన్కౌంటర్ జరుగుతుంది. 

 

సోపోర్‌లోని రెబ్బన్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని అధికారులు పేర్కొన్నారు. పోలీసులు, భద్రతా దళాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి అని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఉన్నారు అనే నిఘా వర్గాల పక్కా సమాచారంతో గాలింపు చర్యలు జరపగా ఉగ్రవాదులు తారస పడినట్టు తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే కాల్పులకు దిగారు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: