మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని, కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. రాజస్థాన్ ప్రభుత్వంలో డిప్యూటి సిఎం గా ఉన్న సచిన్ పైలెట్ ని బిజెపి టార్గెట్ చేసింది. ఆయన ద్వారా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ప్రణాలికలు సిద్దం చేస్తుంది బిజెపి. ఆయన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా వారిలో 16 మంది ఢిల్లీ ఐటిసీ హోటల్ కు చేరారు. 

 

ఇక ఆయన వర్గానికి చెందిన మరో 9 మంది కూడా ఢిల్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని  కాంగ్రెస్ చెప్తున్నా సరే సాధ్యం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. 200 సీట్లు ఉన్న రాజస్థాన్‌ అసెంబ్లీలో 101 మేజిక్ ఫిగర్ కావాల్సి ఉండగా కాంగ్రెస్ కు 119 మంది ఉన్నారు. బిజెపికి 72 మంది ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: