భారత్ లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది గాని ఏ మాత్రం కూడా తగ్గే అవకాశాలు అనేవి కనపడటం లేదు. కరోనా వైరస్ ను ఎంత సమర్ధంగా ఎదుర్కొన్నా సరే కేసులు మాత్రం చాలా వేగంగా నమోదు అవుతున్నాయి. 

 

గత 24 గంటల్లో భారతదేశంలో 28,637 కేసులు & 551 మరణాలు నమోదయ్యాయి. మొత్తం దేశ వ్యాప్త కరోనా కేసులు 8,49,553 గా ఉన్నాయని కేంద్రం పేర్కొంది. వీటిలో 2,92,258 క్రియాశీల కేసులు ఉన్నాయని చెప్పింది.  5,34,621 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. 22,674 మంది దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించారు అని  ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: