రోజు రోజుకు భారత్ కరోనా కల్లోల భారతంగా మారిపోతుంది. గత 24 గంటల్లో భారత్లో కొత్తగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇక తాజా కేసులు కూడా కలుపుకుంటే ఇప్పటివరకు నమోదైన కరోనా కేసులు సంఖ్య 8,49,553గా ఉంది.
కాగా కరోనాతో కొత్తగా 551 మరణించడంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 22,674కు చేరింది. ఈ జోరు చూస్తుంటే కరోనా కేసులు దేశంలో మూడు రోజులకే లక్ష దాటేసే ప్రమాదం కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 5,34,621గా ఉంది. దేశంలో ప్రస్తుతం 2,92,258 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.