కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి వరుడి కుటుంబంలోని ఐదు ప్రాణాలను బలిగొంది. తమ అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నడనే నెపంతో అబ్బాయి ఇంటిపై అమ్మాయి తరఫువారు దాడికి పాల్పడటంతో పాటు అబ్బాయి ఇంటిలోని ఐదుగురిని దారుణంగా హత్య చేశారు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. 
 
మౌనేశ్‌ (31), మంజుల (31) ఐదు నెలల క్రితం ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అబ్బాయి తరపు కుటుంబ సభ్యులు అంగీకరించినా అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు. నిన్న మధ్యాహ్నం సమయంలో యువతి తరపు బంధువులు దాడి చేయడానికి వస్తున్న విషయం తెలిసి నూతన దంపతులు పారిపోయారు. యువతి బంధువులు యువకుడి అన్న నాగరాజ (38), తల్లి సుమిత్ర (55), వదిన శ్రీదేవి (30), అన్న హనుమేశ్‌(40)లపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: