ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అధికార పార్టీ వైసీపీపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రంలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిందని అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు అన్యాయం చేశారని చెప్పారు. ఎన్నికలకు ముందు ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని అన్నారు. 
 
సీఎం జగన్ పదో తరగతి కూడా పాసు కాని కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చారని విమర్శలు చేశారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో రాష్ట్రంలో డిగ్రీలు చేసిన వాళ్లను బేరర్లుగా పెట్టిందని వ్యాఖ్యలు చేశారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ను ప్రకటిస్తామని సీఎం జగన్ చెప్పారని... కానీ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 3 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: