కరోనా దెబ్బతో పలువురు సెలబ్రిటీలు గజగజా వణికి పోతున్నారు. ఈ రోజు బాలీవుడ్లో బిగ్ బీ అమితాబచ్చన్తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్తో పాటు అనుపమ్ ఖేర్ కుటుంబం సైతం కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. అనుపమ్ ఖేర్ కుటుంబంలోనే ఏకంగా నలుగురికి కరోనా వచ్చింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కరోనా ప్రభావంతో ఓ రాష్ట్ర గవర్నర్ ఏకంగా క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. మహారాష్ట్ర రాజ్భవన్లో 18 మంది సిబ్బందికి కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిలో గవర్నర్తో సన్నిహితంగా మెలిగిన సిబ్బంది కూడా ఉన్నారు.