బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కి కరోనా రాగానే బాలీవుడ్ లో చాలా వరకు కూడా ఆందోళన మొదలయింది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. ఇక బిజెపి ఎంపీ హేమ మాలిని కూడా కరోనా బారిన పడ్డారు అనే వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె స్పందించారు. అసలు తనకు ఏ కరోనా రాలేదని ఆమె స్పష్టం చేసారు. 

 

ఈ మేరకు ఆమె ఒక వీడియో ని విడుదల చేసారు. ఆ వీడియో లో ఆమె  తన ఆరోగ్యం గురించి ప్రకటించారు. “కొంతమంది ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే వారు కొన్ని వార్తలు విన్నారు, ఇలాంటిదేమీ లేదు. శ్రీకృష్ణుని దయవల్ల నేను పూర్తిగా బాగున్నానని ఆమె తన వీడియో లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: