మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో కరోనా వార్తలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గవర్నర్ కార్యాలయంలో పని చేసే సిబ్బందికి కరోనా వచ్చింది. మొత్తం 19 మంది కరోనా బారిన పడ్డారు. దీనితో ఆయనకు కూడా కరోనా వచ్చి  ఉండవచ్చు అనే వార్తలు వచ్చాయి. దీనిపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

నేను పూర్తిగా బాగానే ఉన్నాను, మరియు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాను అని ఆయన స్పష్టం చేసారు. నేను సంబంధిత కరోనా పరీక్షలు చేయించుకున్నానని ఆయన పేర్కొన్నారు. దాని ఫలితం ప్రతికూలంగా వచ్చిందని చెప్పారు. తనకు కరోనా లక్షణాలు లేవు అని ఆయన స్పష్టం చేసారు. గవర్నర్ కార్యాలయంలో పూర్తిగా శానిటేషన్ చేసారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: