సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు-2020లో మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రజల పక్షాన అమ్మవారిని తాను కోరుతానని ఆయన పేర్కొన్నారు. 

 

తలసాని కుటుంబ సభ్యుల సమక్షంలో అమ్మవారికి మొదటి బోనాన్ని గుడి బయటే సమర్పించడం విశేషం. ఆర్మీ రిటైర్ ఉద్యోగి మధ్యప్రదేశ్ నుంచి ఉజ్జయిని అమ్మవారిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బోనాల జాతర ఎంతో వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు మంత్రి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున అమ్మవారికి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. రేపు భవిష్యవాణితో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: