మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె తో పాటుగా ఆమె కుమార్తె ఆరాధ్యకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ యింది. ఇప్పటికే ఆమె ఇంట్లో భర్త అభిషేక్ బచ్చన్, మావగారు అమితాబ్ కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. 

 

వారు ఇద్దరూ ముంబై నానావతీ ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ క్రమంలో బచ్చన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా పరిక్షలు చేయగా అందరికి పాజిటివ్ వచ్చింది. అయితే వీరు ఎవరికి కరోనా లక్షణాలు బయటపడలేదు అని సమాచారం. ఇక ఫ్యామిలీ మొత్తానికి కరోనా రావడంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పుడు వీరిని కలిసిన వారు అందరూ పరిక్షలు చేయించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: