గాల్వన్ లోయలో జూన్ 15న జరిగిన భారత్- చైనా సైనికుల ఘర్షణ సందర్భంగా మన దేశ భూభాగాన్ని చైనా ఆర్మీ లాక్కుందా? అంటూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని నరేంద్ర మోడీ ని ప్రశ్నించారు. జరిగినది ఏమిటి, మోదీగారి పాలనలో భరత మాత పవిత్ర భూమిని చైనా లాక్కుందా? అని ఆయన నిలదీశారు. 

 

గత కొన్ని రోజులుగా భారత్ విషయంలో చైనా వైఖరి చైనా విషయంలో భారత్ వైఖరిని రాహుల్ గాంధి పదే పదే ప్రశ్నిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. చైనా ఆర్మీ దాడులు చేసిన నాటి నుంచి కూడా రాహుల్ పదే పదే కేంద్రం లక్ష్యంగా ప్రధాని లక్ష్యంగా విమర్శలను చేస్తూ వస్తున్నారు. మోడీ కారణంగానే ఈ పరిస్థితి అంటూ ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: