ఏపీలో విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా సరే...  కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినా సరే కరోనా పరిక్షలు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. కరోనా పరీక్షలను ఏ మాత్రం కూడా ఏపీ సర్కార్ లైట్ తీసుకోవడం లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పరీక్షలను కూడా  వేగంగానే చేస్తున్నారు. 

 

గత 24 గంటల్లో 17 వేల 624 మందికి కరోనా పరిక్షలు చేసారు. ఇప్పటి వరకు 11 లక్షల 53 వేలకు పైగా కరోనా పరిక్షలు చేసారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో కరోనా పరీక్షలను నిర్వహించడం లేదు. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరిస్తుంది ఏపీ సర్కార్. కాగా నేడు 1900 పైగా కరోనా కేసులు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: