బిగ్ బీ అమితాబ్ ఫ్యామిలీ ఇప్పుడు కరోనా  బారిన పడటం తో ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా విస్మయం వ్యక్తం చేసింది. ముందు అమితాబ్ కి కరోనా రాగా అక్కడి నుంచి ఆయన తనయుడు అభిషేక్ కి కరోనా వచ్చింది. ఇక ఆ వెంటనే ఆయన కోడలు, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ కి కరోనా పాజిటివ్ వచ్చింది అని అధికారులు ప్రకటించారు. 

 

ఇదిలా ఉంటే అమితాబ్ ఆరోగ్యం త్వరగా కుదుట పడాలి అని పలువురు ప్రపంచ వ్యాప్తంగా కోరుకుంటున్నారు. ఆయన అభిమానులు అయితే పూజలు కూడా చేయడం మొదలు పెట్టారు. తాజాగా భారత దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరియు అతని కుమారుడు నటుడు అభిషేక్ బచ్చన్ మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని... నేపాల్ ప్రధాన మంత్రి కెపి శర్మ ఒలి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: