తెలంగాణాలో పులులు ప్రజలను భయపెడుతున్నాయి. పులి పేరు వినేట్ చాలు ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తాజాగా మరో చోట పెద్ద పులి సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. కొమరం భీమ్ జిల్లాలో తాజాగా పులి బయటకు వచ్చింది. బెజ్జూరు అటవీ మార్గంలో పెద్దపులి కలకలం సృష్టించింది. 

 

బెజ్జురు నుంచి కమ్మర్‌గాం వెళ్లే దారిలో ద్విచక్ర వాహనం పైకి పెద్ద పులి దూసుకు వచ్చింది. దీనితో యువకులు ఇద్దరు బండి మీద నుంచి కింద పడగా వారికి గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడి నుంచి వారు తప్పించుకున్నారు. ఇక అక్కడ పెద్దపులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు ఎప్పుడు ఎం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: