ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరించినా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా తీవ్రతపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. నేడు ఏకంగా ఒక్క రోజే దాదాపుగా రాష్ట్రంలో రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

ఇదిలా ఉంటే తాజాగా  టీడీపీ నేత ఒకరు కరోనాతో మరణించారు. ప్రముఖ వ్యాపారవేత్త, పి.టి రంగరాజన్‌ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతి పట్ల నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌‌రెడ్డి, టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర సంతాపం  ప్రకటించారు. ఆయనకు రాజకీయాల్లో సుధీర్గ అనుభవం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: